ఈ నేపధ్యంలో మాటీవీ కొత్తగా 'మా మూవీస్' పేరుతో మరో కొత్త చానెల్ ని ప్రారంభించడంతో శాటిలైట్ రైట్స్ మళ్లీ ఊపందుకుంటున్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దానికి ఊతమిస్తున్నట్టుగా ఇటీవల మాటీవీ 'దూకుడు' సినిమా శాటిలైట్ రైట్స్ ని పెద్ద మొత్తం వెచ్చించి, చేజిక్కించుకున్నట్టు చెబుతున్నారు. సుమారు 5.75 కోట్లకు ఈ సినిమా హక్కుల్ని మాటీవీ పొందినట్టు తెలుస్తోంది. దీంతో మాటీవీ ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో 'దూకుడు'గా వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే టర్కీ, దుబాయ్ లలో షూటింగ్ పూర్తి చేసుకొని, రీసెంట్ గా పాటలు మరికొన్ని సీన్స్ ను కచ్, గుజరాత్ లలో చిత్రీకరించిన విషయంత తెలిసిందే. కాగా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి 15న హైదరాబాదులో మొదలై మార్చి చివరికి పూర్తవుతుందని సమాచారం.
BREAKING NEWS
Monday, February 14, 2011
శాటిలైట్ రైట్స్ లో మహేష్ 'దూకుడు' కి 5.75కోట్లు.
ఈ నేపధ్యంలో మాటీవీ కొత్తగా 'మా మూవీస్' పేరుతో మరో కొత్త చానెల్ ని ప్రారంభించడంతో శాటిలైట్ రైట్స్ మళ్లీ ఊపందుకుంటున్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దానికి ఊతమిస్తున్నట్టుగా ఇటీవల మాటీవీ 'దూకుడు' సినిమా శాటిలైట్ రైట్స్ ని పెద్ద మొత్తం వెచ్చించి, చేజిక్కించుకున్నట్టు చెబుతున్నారు. సుమారు 5.75 కోట్లకు ఈ సినిమా హక్కుల్ని మాటీవీ పొందినట్టు తెలుస్తోంది. దీంతో మాటీవీ ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో 'దూకుడు'గా వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే టర్కీ, దుబాయ్ లలో షూటింగ్ పూర్తి చేసుకొని, రీసెంట్ గా పాటలు మరికొన్ని సీన్స్ ను కచ్, గుజరాత్ లలో చిత్రీకరించిన విషయంత తెలిసిందే. కాగా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి 15న హైదరాబాదులో మొదలై మార్చి చివరికి పూర్తవుతుందని సమాచారం.
మహేష్ బాబు దూకుడు చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంతంటే...
మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న "దూకుడు" చిత్రం ప్రారంభం నుంచి విపరీతమైన క్రేజ్ క్రియోట్ చేస్తూ వస్తోంది. దాంతో మార్కెట్లో నూ ఈ చిత్రంపై మంచి హైప్ ఏర్పడి ..శాటిలైట్ రైట్స్ ఐదు కోట్ల డబ్బై ఐదు లక్షలు వరకూ పలికినట్లు సమాచారం. మా టీవీ వారు ఈ చిత్రం ను తీసుకున్నారు. మాటీవీ వారు రీసెంట్ గా లాంచ్ చేసిన మా మూవీస్ కోసం ఈ చిత్రం పోటీపడి మరీ తీసుకున్నారు.
ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.ఇప్పటికే టర్కీ, దుబాయి,గుజరాత్ లలో ఈచిత్రం షూటింగ్ జరుపుకుని వచ్చింది.తదుపరి షెడ్యూల్ పిబ్రవరి 15 నుంచి మార్చి 3 వరకూ హైదరాబాద్ లో జరగనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.
పోకిరి స్టైల్లో ‘దూకుడు’ చేయాలని మహేష్ టెన్షన్..
శ్రీనువైట్ల దర్శకుడు కావడంతో, మహేష్ మీద నమ్మకాల్లేకపోయినా ఈ సినిమా ఎలాగోలా తొందరగా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుందని మహేష్ అభిమానులు బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. అందుకే, చాలా తొందరగా ‘ఖలేజా’ ప్లాప్ ని దిగమింగేసుకున్నారు. అయితే మహేష్ మాత్రం ‘దూకుడు’ సినిమాని ఫలానా టైమ్ లో మీ ముందుకు తెస్తాననే భరోసా అభిమానులకు ఇవ్వలేకపోతున్నాడు. శ్రీను వైట్ల సినిమాకు బిన్నంగా ‘దూకుడు’ చాలా స్లోగా తెరకెక్కుతోందిట. మళ్ళీ ‘ఖలేజా’ టైమ్ కి తప్ప ఈలోగా సినిమా విడుదలయ్యే అవకాశాలు కన్సించడంలేదు. ఈ నేపథ్యంలోనే మహేష్ ఏమో ‘పోకిరి’ స్టైల్ లో ఫినిష్ చెయ్యాలనీ, బాక్సాఫీస్ లో భారీ లాభాల్ని చూపించాలనీ కలలు కన్న మహేష్ తాను టెన్షన్ పడిపోతూ, శ్రీను వైట్లను టెన్షన్ పెట్టేస్తున్నట్టు సమాచారం. సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే..
అదుర్స్ సినిమా నుంచే నాపై బ్రహ్మానందం కన్నేశాడంటున్న హీరోయిన్..
ఈ మాట ఆనోట ఈనోట వెళ్శి చివరకు బ్రహ్మానందం సన్నిహితుల దగ్గరకి చేరి అసలు విషయం ఏమైందని కనుక్కునేందుకు షీలా దగ్గరకు వెళ్తే అదుర్స్ సినిమా నుండి బ్రహ్మానందం తనపట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్తూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ద్వందార్దాలతో సైగలతో తనని ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నాడని వాపోయిందంట. మొన్నిటికి మొన్న హాస్యనటుడు శివారెడ్డి కూడా బ్రహ్మానందం తనని వేధిస్తున్నాడంటూ మీడియా ముందు వాపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి బైటకు వచ్చేందుకు బాధ పడుతున్న బ్రహ్మానందంపై షీలా ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ముక్కున వేలేసుకుంది..ఇక మీదటైనా బ్రహ్మానందం ఇలాంటి పనులు మానుకోవాలని తన సన్నిహితులు హెచ్చరించినట్లు సమాచారం.
త్రిష మసాజ్ వీడియోకు నెట్ లో భలే డిమాండ్
జూ ఎన్టీఆర్ ‘శక్తి’ స్టోరీ లీక్ అయింది..ఇక రికార్డు బ్రద్దలే...!?
ఎన్టీఆర్ నటిస్తున్నశక్తి సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ బయటికి లీకయ్యిందట. లీకయిన కథ ప్రకారం సినిమా యాక్షన్ ఓరియంటెడ్ గా రూపొందుతోందని చెప్పోచ్చు. ఎన్టీఆర్ ఓ ఫవర్ ఫుల్ ఆయుధాన్ని వెతకడానికి రకరకాల ప్లేస్ లకు వెళతాడట. ఆ ఆయుధం చాలా శక్తివంతమైనదిగా తెలుస్తోంది. ఎలాగైనా ఆ ఆయుధాన్ని సాధించి తీరాలే పట్టుదలతో దాన్ని వెతుక్కుంటూ వెళుతున్న ఎన్టీఆర్ రకరకాల ఆపాయాలను, అనుభవాలను ఎదుర్కొంటాడట. ఫైనల్ గా ఎన్టీఆర్ కు ఈ ఆయుధం దొరుకుతుందా లేదా? ఈ అపాయాలను దర్శకుడు మోహర్ రమేష్ చాలా అడ్వంచర్ గా చిత్రీకరించాడని సమాచారం. ఈ చిత్రంలోని పాటలను ఈనెల 27న, మార్చి 30న చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్ణయించారు.
అప్పలరాజు చిత్రంలో వర్మ వాయిస్ ఓవర్ లో ...
మొన్న రక్త చరిత్ర చిత్రంతో తన వాయిస్ తో నేరాలు-ఘోరాలు ని మరపించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తన వాయిస్ ని వినిపించటానికి రెడీ అవుతున్నారు. ఆయన తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం ...అప్పలరాజు లో ఆయన మొదట ఓ ఉపోద్ఘాతం ఇస్తారు.తెర మీద బొమ్మ పడగానే వర్మ గొంతు వినిపిస్తుంది. ఆ ఉపోద్ఘాతం లో 'ఇది కామెడీ సినిమా - కాసేపు నవ్వుకొందాం అని వస్తే సారీ...' అంటూ సినిమా జెనర్ గురించి ముందుగా చెప్పి ప్రిపేర్ చేస్తారు.
ఇక ఫిల్మ్నగర్లో అప్పల్రాజు చేసిన ప్రయాణమే ఈ సినిమా. అప్పలరాజుకి అమలాపురంలో సినిమాలు చూడ్డం తప్ప మరే పనీ ఉండదు. థియేటర్కి వెళితే... సినిమాలన్నీ ఒకేలా పరమ బోర్ కొట్టేస్తున్నాయి. 'ఓస్... ఈ మాత్రం సినిమా నేను తీయలేనా..?' అనుకొని హైదరాబాద్ వచ్చేస్తాడు.అక్కడనుంచి అతను సినీ పరిశ్రమలోని పరిచయమయ్యే విచిత్రమైన పాత్రలతో అతను జర్నీ చేసి ఎలాంటి సినిమా తీస్తాడు అనేది కథ.
అప్పల్రాజు పాత్రలో సునీల్ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్, కృష్ణుడు, వేణుమాధవ్, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్ వర్మ.
రీమేక్ సినిమాలకు కొత్త శ్రీకారం చుట్టినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఇకపోతే బాలీవుడ్ హిట్ సినిమాలని రీమేక్ చేయడానికి తెలుగు సినిమా నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. దానికి కారణం బాలీవుడ్ సినిమాలు నైజాంతో పాటు అన్ని ముఖ్యమైన నగరాలలో విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి విడుదలయిన వెంటనే మనవాళ్శు వెంటనే కవర్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాటిని రీమేక్ చేసినా ఉపయోగం ఉండకపోవచ్చనే కాబోలు వాటిని రీమేక్ చేయడం మానివేశారు మనవాళ్శు.
కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా బాలీవుడ్ లో హిట్ అయినటువంటి లవ్ ఆజ్ కల్, దబాంగ్ రీమేక్ వల్ల టాలీవుడ్ నిర్మాతలు దృష్టి ఇప్పుడు బాలీవుడ్ సినిమాల మీద పడిందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా బాలీవుడ్లో రీసెంట్గా హిట్స్ అయినటువంటి నోవన్ కిల్డ్ జెస్సికా, యమ్లా పగ్లా దీవాలా లాంటి సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడిందని ఫిలింవర్గాల సమాచారం. ఇలాగే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఇంత గిరాకీ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు.
గోపీచంద్ 'వాంటెడ్' చిత్రం సెన్సార్ కట్స్ ఏమిటంటే...
1. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'నిత్యానందం' పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
2. మూడు నాలుగు రీళ్లలో పిక్చరైజ్ చేసిన 'నా కాయని గిచ్చావ్' అనే డైలాగ్లలోని ''కాయ''ని తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.
3. అయిదు ఆరు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో 'స్త్రీలను గర్భిణీ స్త్రీలను చేస్తూ వుంటారు' అనే డైలాగ్ని తొలగించి శబ్దం వినబడనీయకూడదన్నారు.
4. తొమ్మిది పది రీళ్ళలో గల 'ముండ' పదాన్ని తొలగించి శబ్దం వినబడనీయ వద్దన్నారు.
16 రీళ్ళ నిడివిగల 'వాంటెడ్' 26-1-2011న విడుదలయింది.
గోపిచంద్, దీక్షాసేథ్, జయసుధ, చంద్రమోహన్, ప్రకాష్రాజ్, నాజర్, బ్రహ్మానందం, సుబ్బరాజు ముఖ్యపాత్రలు పోషించిన 'వాంటెడ్' చిత్రాన్ని ఇసి చూసి 4 కట్స్తో 24-01-2011న 'యుఎ' సర్టిఫికెట్ జారీచేసింది.
నట్టికుమార్ నా దృష్టిలో గొప్ప నిర్మాత...జగపతి బాబు
నిర్మాతగా మారునున్న అల్లు గారి అబ్బాయి..!?
గతంలో గీతా ఆర్ట్స్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నిర్మించిన మిందీ చిత్రం ‘గజినీ’ కి సంబంధించి ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ శిరీష్ దగ్గరుండి చూసుకున్నాడు. అలాగే సినిమా నిర్మాణంపై మరియు పంపిణి వ్యవస్థ మీద అతనికి ఉన్న అవగాహన ట్విట్టర్ లో శిరీష్ పోస్ట్ చేస్తున్న సమాచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కాకపోతే అతను ఎవరితో, ఎప్పుడు సినిమా మొదలు పెడగాడు వంటి విషయాలు తెలుసుకోవటానికి మరి కొంత సమయం వేచి చూడాలి.
'గగనం' చిత్ర కథ కాపీ వివాదంపై దిల్ రాజు ఘాటు స్పందన
తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణపై కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన?
నాలుగు జిల్లాలకు చెందిన సింగరేణి కార్మికులు కూడా సహాయ నిరాకరణకు సమాయత్తమయ్యారు. బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేయడానికి వారు పూనుకున్నారు. అన్ని గనుల్లోనూ పనులు జరగకుండా బైఠాయించాలని వారు నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వానికి విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో ఆయన సోమవారం వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు. బిల్లు ప్రతిపాదించడం అటుంచితే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాజకీయ నాయకులు కూడా కోరుతున్నారు.
ఉద్యోగుల సహాయ నిరాకరణకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా మద్దతు ప్రకటించారు. సహాయ నిరాకరణ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు తాను ధర్నాకు దిగుతానని ఆమె హెచ్చరించారు. మొత్తం మీద సహాయ నిరాకరణపై వాతావరణం వేడెక్కుతోంది
మార్చిలోనే పార్టీని వైయస్సార్ సమాధి వద్ద ప్రకటిస్తా: వైయస్ జగన్
సోమవారం ఆయన బద్వేల్లో సభలో మాట్లాడారు. త్వరలోనే వైఎస్ఆర్ స్వర్ణయుగం వస్తుందన్నారు. ఆ పాలన ముప్పయి ఏళ్లపాటు కొనసాగుతుందని జగన్ తెలిపారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ పాదాల చెంత మార్చిలోపేదల పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పేర వైయస్ జగన్ తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
మేం తెచ్చుకున్న సీట్లు, ఓట్లు తెచ్చుకో: జగన్కు చిరు సవాల్
ప్రభుత్వాన్ని ఆదుకునేందుకే ఆపద్బాంధవుడి అవతారం ఎత్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. స్వార్థంతో విమర్శించే వారిని మేం పట్టించుకోమని చెప్పారు. వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కొత్తగా వచ్చిన పార్టీ 18 సీట్లు గెలుచుకోవడం సాధారణ విషయం కాదన్నారు.
రామోజీరావుపై మళ్లీ యుద్ధం ప్రారంభించిన ఎంపీ ఉండవల్లి అరుణ్
నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆయన దువ్వూరిని కోరారు. గతంలోనే తాను మార్గదర్శిపై ఆర్బిఐ దృష్టికి తీసుకు వచ్చానని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉండవల్లి నాలుగు పేజీల లేఖను దువ్వూరికి ఇచ్చారు. ఉండవల్లి అరుణ్కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రామోజీరావును లక్ష్యంగా పలుమార్లు విమర్శలు గుప్పించారు. మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలు రాశారు. అయితే వైఎస్ మరణం అనంతరం ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ రామోజీరావుపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు.
బాబాయ్, అబ్బాయిలకు ప్రజలే బుద్ధి చెప్తారు: చంద్రబాబు ధ్వజం
దేశంలో, రాష్ట్రంలో సంపదను కొన్ని కుటుంబాలే దోచుకుంటున్నాయని బాబు విమర్శించారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు అంకాలమ్మ గూడూరులో రోడ్ షో నిర్వహించారు. చిత్రావతి-లింగాల ప్రాజెక్టు పనులకోసం వైఎస్ వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుపెట్టారు తప్ప ఒక్క ఎకరాకు నీరివ్వలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ చితికిపోతున్నది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నా పేదవాడి ఆదాయం మాత్రం పెరగడంలేదని చంద్రబాబు తెలిపారు. ధరలను అదుపుచేయలేని ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. సూక్ష్మ రుణ సంస్థలకు ఎవరూ రుణాలు కట్టవద్దని, మీకు అండగా టీడీపీ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సామాజిక న్యాయం అంటూ, కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయినా, అందులో చిరంజీవి ఏమీ సాధించలేరని బాబు విమర్శించారు. కాగా పులివెందులలో బహిరంగ సభ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బాబు వారిపై మండిపడ్డారు. జిల్లా ఆయన పర్యటన రెండు రోజులపాటు సాగుతుంది.
Subscribe to:
Posts (Atom)