BREAKING NEWS
Sunday, February 27, 2011
రామ్ గోపాల్ వర్మ చిత్రంలో నటించనున్న మోహన్ బాబు!?
ఇక ఈ సినిమాని వర్మ శిష్యుడు వివేక్ డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కేవలం సమర్పిస్తారు మాత్రమే అని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్తున్నారు. నాగచైతన్య హీరోగా నటించే ఈ చిత్రం మార్చి నెలాఖరుకు మొదలుకానుంది. అప్పరాజు నిర్మించిన కిరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ సాంగ్ ని ఇప్పటికే అంతటా పాపులర్ అయింది. అలాగే ఈ చిత్రం బెజవాడలోని రౌడీయిజం,గూండాయిజం నేపధ్యంలో సాగనుంది. ఇప్పటికీ టైటిల్ మార్చమని ఆయనకు ఒత్తిళ్ళు వస్తున్నాయి.
సునీల్ హీరోగా దిల్ రాజు భారీ చిత్రం..డిటేల్స్
ఇక "నెపోలియన్" టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్ కామిడీ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయనున్నారు. అలాగే ఈ చిత్రానికి మొదట శివం అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. కాని కథకు నెపోలియన్ టైటిల్ సూట్ అవుతుందనిపించటంతో ఈ టైటిల్ కు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందిన కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పల్రాజు చిత్రం క్రిందటివారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. హీరోగా నెపోలియన్ చిత్రం సునీల్ కి నాలుగవది. ఈ చిత్రంపై సునీల్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.
తెలుగు హీరోల్లో టాప్ రెమ్యునేషన్ ఆ హీరోకా..నిజమా?
ఆ పత్రికలో పడిన దాని ప్రకారం రెమ్యునేషన్స్ ...
జూ.ఎన్టీఆర్ : 9 కోట్లు
రవితేజ : 7 కోట్లు
పవన్ కళ్యాణ్ :6.5 కోట్లు
మహేష్ బాబు: 6 కోట్లు
రామ్ చరణ్ :6 కోట్లు
నాగార్జున :5 కోట్లు
అల్లు అర్జున్ : 5 కోట్లు
వెంకటేష్ : 4 కోట్లు
నాగచైతన్య : 3.5 కోట్లు
రాణా : 3 కోట్లు
ఇవీ ఆ రెమ్యునేషన్స్ ..వీటిని బేస్ చేసుకుని ఇప్పటికే కొన్ని టీవీ ఛానెల్స్ వారు పోగ్రామ్ లు ప్రసారం చేసారు. ఇంతకీ ఇవి నిజమేనంటారా...
ఆన్లైన్లో బెట్టింగ్కు పాల్పడుతున్న ఐదుగురు బూకీల అరెస్టు!
మరోవైపు రాజధాని నగరం హైదరాబాద్లో ఆన్లైన్లో బెట్టింగులకు పాల్పడుతున్న వారి గురించి పోలీసులు డేగ కళ్లతో వెతుకుతున్నారు. మప్టీలో పోలీసులు వారికోసం వెతుకులాట ప్రారంభించారు. గండిపేట, షామీర్పేట, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో పోలీసులు మప్టీలో బెట్టింగ్కు పాల్పడుతున్న వారికోసం వెతుకుతున్నారు.
ఎమ్మెల్యే తనయుడి పెళ్లిలో చిరంజీవికి చేదు అనుభవం
చిరును తెలంగాణవాదులు అడ్డుకొని తెలంగాణ వ్యతిరేకి అయిన చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనాలన్నారు. అయితే చిరంజీవి వారి మాటలను ఏమీ పట్టించుకోకుండా లోనికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. అయితే జై తెలంగాణ అంటేనే లోనికి పంపిస్తామని తెలంగాణవాదులు చెప్పారు. దీంతో ఆయన చిరు నవ్వుతో అక్కడినుండి సెక్యురిటీ మధ్య బయటకు వచ్చేశారు. వివాహ వేడుకలో రసాభాస జరగడం తనకు ఇష్టం లేనందునే అందుకే తిరిగి వచ్చానని ఆయన చెప్పారు.
Subscribe to:
Posts (Atom)