అలాగే రీసెంట్ గా మణిరత్నం సినిమాలో నటించబోతున్నాడు అని చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు మహేష్ బాబు. కానీ ఈ వార్త విన్న మహేష్ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. ఇప్పటికే మణిరత్నం సంవత్సరాలు తరబడి తీసిన రావన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దీనికి తోడు ఇప్పుడు మహేష్ తో తీయబోయే సినిమా ‘పొన్నియన్ సెల్వమ్’ నవల ఆధారంగా వందల సంవత్సరాల నాటి చోళుల కధ అంట. ఇప్పటికే ఖలేజా సినిమా గురుంచి సంవత్సరాలు వేచి చూసినా గాని అభిమానులను మెప్పించలేకపోయింది.ఇప్పుడు మణిరత్నం తో సినిమా అంటే అది రిలీజ్ కావడానికి మినిమం రెండు మూడు సంవత్సరాలు పట్టడం ఖాయం. మహేష్ ఫ్యాన్స్ కి తమ హీరో వరుస సినిమాల గ్రీన్ సింగ్నల్ ఇస్తూ పోతుంటే ఒకప్రక్క ఆనందం, మరోప్రక్క భయం, తర్వాత చిత్రాలైనా హిట్ ఇస్తాయోలేదో అనే అయోమయం. ఇప్పటికే మహేష్ బాబు కి బద్ధకం బాగా పెరిగిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి. ట్విటర్ లో ఉన్నంత యాక్టివ్ గా సెట్స్ మీద వుండటం లేదని దర్శకుడు శ్రీను వైట్ల భాదపడుతున్నాడని టాలీవుడ్ టాక్.ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు తెర మీదకి వస్తుందో వేచి చూడాల్సిందే.
BREAKING NEWS
Friday, March 4, 2011
మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒకపక్క భయం..మరోప్రక్క నిరాశ...!?
అలాగే రీసెంట్ గా మణిరత్నం సినిమాలో నటించబోతున్నాడు అని చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు మహేష్ బాబు. కానీ ఈ వార్త విన్న మహేష్ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. ఇప్పటికే మణిరత్నం సంవత్సరాలు తరబడి తీసిన రావన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దీనికి తోడు ఇప్పుడు మహేష్ తో తీయబోయే సినిమా ‘పొన్నియన్ సెల్వమ్’ నవల ఆధారంగా వందల సంవత్సరాల నాటి చోళుల కధ అంట. ఇప్పటికే ఖలేజా సినిమా గురుంచి సంవత్సరాలు వేచి చూసినా గాని అభిమానులను మెప్పించలేకపోయింది.ఇప్పుడు మణిరత్నం తో సినిమా అంటే అది రిలీజ్ కావడానికి మినిమం రెండు మూడు సంవత్సరాలు పట్టడం ఖాయం. మహేష్ ఫ్యాన్స్ కి తమ హీరో వరుస సినిమాల గ్రీన్ సింగ్నల్ ఇస్తూ పోతుంటే ఒకప్రక్క ఆనందం, మరోప్రక్క భయం, తర్వాత చిత్రాలైనా హిట్ ఇస్తాయోలేదో అనే అయోమయం. ఇప్పటికే మహేష్ బాబు కి బద్ధకం బాగా పెరిగిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి. ట్విటర్ లో ఉన్నంత యాక్టివ్ గా సెట్స్ మీద వుండటం లేదని దర్శకుడు శ్రీను వైట్ల భాదపడుతున్నాడని టాలీవుడ్ టాక్.ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు తెర మీదకి వస్తుందో వేచి చూడాల్సిందే.
ఆ హీరోయిన్ ని మూసుకొని కూర్చొమన్న ఫోటోగ్రాఫర్...!
డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్-జూ ఎన్టీఆర్..!?
అందుకే వేసవిలో విడుదలకి సన్నద్దమవుతున్న ఎన్టీఆర్ సినిమా ‘శక్తి’, పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ చిత్రాల మధ్య రెండు వారాల గ్యాప్ ఖచ్చితంగా ఉండేలా ఆయా చిత్రాల నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఏ కారణాల వల్ల అయినా ముందు అనుకున్న తేదీలో మార్పు జరిగినా కానీ మరో చిత్రం కూడా అందుకు తగ్గట్టే వెనక్కి వెళ్లి రెండు వారాల డిస్టెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుందట. అయితే ఆ చిత్రాల మధ్య అగ్రిమెంట్ వరకు బానే ఉంది కానీ ఈ మధ్య లో మరేదైనా భారీ చిత్రం వచ్చి క్లాష్ అయితేనే ఇబ్బంది తలెత్తుతుంది.
రజనీ స్పెషల్: మూడు పాత్రలు...ఆరుగురు హీరోయిన్స్
నాకు బాగా నచ్చిన ఉచిత సలహా అదే...ఇలియానా
చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పందం, కడపలో విజయానికి?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎవరి ఓట్లయినా అడుగుతామని కూడా ఆయన చెప్పారు. తాము పోటీ చేయని చోట్ల తమ ప్రజాప్రతినిధులు ఓటింగుకు దూరంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్ర రావు గురువారం సాయంత్రం చెప్పారు. అయితే, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఓటింగుకు దూరంగా ఉండేలా లేరు. మిగతా చోట్ల కూడా బహుశా ఉండకపోవచ్చు. ఈ పరిణామాలను, ముఖ్యమంత్రి ప్రకటనను చూస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య ఒప్పందం కుదిరినట్లే కనిపిస్తోందని అంటున్నారు. ఆదిలోనే వైయస్ జగన్ను, అందులోనూ కడప జిల్లాలో దెబ్బ తీయడానికి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కటైనట్లు అనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడప జిల్లాలో వైయస్ జగన్ వర్గం నుంచి శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవరగుడి నారాయణ రెడ్డిని పోటీకి దించుతోంది.
దేవరగుడి నారాయణ రెడ్డిని ఓడించి ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవడానికి జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం జిల్లా నాయకులతో సమావేశాలు, విందులు జరుపుతూ తమ వైపు తిప్పుకుంటున్నారు. అంతేకాకుండా, కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికలు వస్తే సీమాంధ్రలో వైయస్ జగన్ వర్గం, తెలంగాణలో తెరాస గెలుస్తాయనే భయంతోనే వారిద్దరు ఒక్కటైనట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
నిన్న బాలయ్య, నేడు చిరు: ఐ హేట్ వెబ్సైట్, అభిమానుల ఫిర్యాదు
ఆ వెబ్సైట్లో చిరంజీవిని, ఆయన ఫ్యామిలీకి చెందిన ఇతర హీరోలను కించపరుస్తూ కొన్ని మెసేజ్లు ఉన్నట్టు చెప్పినట్టుగా తెలుస్తోంది. అభిమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 43 మరియు 63 కింద కేసు బుక్ చేశారు. కాగా గత నెలలో యువరత్న బాలకృష్ణ అభిమానులు కూడా ఐహెట్బాలయ్య అనే వెబ్సైట్పై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అభిమానుల ఫిర్యాదు మేరకు ఆ రెండు వెబ్సైట్లను తొలగించనున్నట్టు చెప్పారు.
Subscribe to:
Posts (Atom)