BREAKING NEWS
Thursday, April 28, 2011
హోమ్లీ హీరోయిన్ కి కూడా బికినీ పిచ్చి పట్టేసుకుంది
'నేను నా రాక్షసి'కి మధ్యలో ఇంటర్వెల్ వేయొద్దంటున్నారు
సింపుల్ స్టోరీ..వండర్ఫుల్ కెమెస్ట్రీ ..'100% లవ్'
దేవుళ్లు కాంబినేషన్లో వెండితెరపై సత్య సాయిబాబా మహిమలు చిత్రంSathya Sai Baba
ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామ జోగయ్య దీనిని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. జోగయ్యతో పాటు కరాటం రాంబాబు, తెలుగమ్మాయి నిర్మించిన వానపల్లి బాబురావు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కోడి రామకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు. కాగా బాబా అంతిమ సంస్కారాల సందర్భంగా సత్యసాయి మహిమలు, సేవా కార్యక్రమాలపై సినిమా ఎందుకు నిర్మించకూడదనే ఆలోచన వచ్చినట్టు హరిరామ జోగయ్య చెప్పారు. ఆ వెంటనే కోడి రామకృష్ణను సంప్రతిస్తే ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో 1994లో తాను మంత్రిగా ఉన్న సమయంలో బాబా వద్దకు తాను వెళ్లినప్పుడు వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు గెలవడం కష్టమని చెప్పారని అలాగే జరిగిందని చెప్పారు. ట్రస్టు సభ్యుల సహకారంతో కథను రెడీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
రామ్ చరణ్ కొత్త చిత్రం'రచ్చ' స్టోరీ ఫ్లోరైడ్ వాటర్ సమస్యతోనే
రామ్ గోపాల్ వర్మ సారి చెప్పటానకే ఆ సూపర్ స్టార్ ఇంటికి
వర్మ కారు రాత్రి చాలా సేపు అమితాబ్ ఇల్లు జల్సా వద్ద నిలబడి ఉందని చెప్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడని, తన కుమారుడు నటన బాగోలని ఎస్సమ్మెస్ లు ఇవ్వటమే కాక తన కుమారుడుని తీసేసి రానాకి అవకాశమివ్వటం ఆయన భరించలేకున్నారని చెప్తున్నారు. అయితే వర్మ జరిగిన దానికి సారి చెప్పుకుని ఈ ప్రాజెక్టుని ఎట్టిపరిస్ధితుల్లోనూ ముందుకు తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అంతేగాక తప్పనిసరి పరిస్ధితి అయితే అభిషేక్ ని మళ్లీ ప్రాజెక్టులోకి తీసుకుంటాని చెప్తున్నారు. అయితే అలా ఒకసారి బయిటకు వచ్చిన అభిషేక్ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ తో చేయటానికి ఇష్టపడతాడా అనేది అందరి ముందున్న ప్రశ్న.
అల్లు అరవింద్ హంగామా అంతా రామ్ చరణ్ ని చల్లబరచడానికే...!?
అయితే ఇంత ఆలస్యంగా విడుదల చేస్తున్న సినిమాకి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక తమిళ చిత్ర ప్రముఖులు అయోమయానికి గురయ్యారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడింత హంగామా చేస్తున్నది రామ్ చరణ్ ని చల్లబరచడానికేనని అంటున్నారు. మగధీర తమిళ వెర్షన్ విడుదల చేయకపోవడం పట్ల చరణ్ చాలా కాలంగా అసహనంతో ఉన్నాడని, అతడిని కూల్ చేయడానికి అల్లు అరవింద్ ఇలా దొంగలు పడ్డ రెండేళ్లకి అలర్ట్ అయిన పోలీసులా విజిల్ ఊదుతున్నాడని చెప్పుకుంటున్నారు.
ఆకుల శివ కథతో రామ్ చరణ్ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ దర్శకత్వంలో
ఐటీ పార్కు భూములకు రెక్కలు, రూ 440 కోట్ల విలువైన భూమి మాయం
కేటాయించిన మొత్తాన్ని కొలతలు వేసి స్వాధీనపర్చాల్సిందేనంటూ లోకాయుక్త గత ఏడాది డిసెంబరులో ఆదేశించింది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం కదలకపోవటంతో ఈనెల 21న జిల్లా సర్వే అధికారులను పిలిచి నెల రోజుల గడువు ఇచ్చింది. అప్పటికే కొలతలు వేసిన సర్వే శాఖ రంగారెడ్డి జిల్లా సహాయ సంచాలకుడు... ఏపీఐఐసీకి అప్పగించిన విస్తీర్ణానికి, వాస్తవ భూమికి మధ్య బాగా వ్యత్యాసం ఉన్నట్టు తేల్చారు. అందువల్ల భూమిని పూర్తి స్థాయిలో స్వాధీనపర్చలేమంటూ చేతులెత్తేశారు. దీంతో సర్వే శాఖ రాష్ట్ర కమిషనరు అనిల్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి భూమి వ్యవహారాన్ని తేల్చాలని భావిస్తున్నట్టు సమాచారం.
రాయదుర్గంలో చాలా ఏళ్లక్రితం భూ గరిష్ఠ పరిమిత చట్టం కింద స్వాధీన పర్చుకొన్న భూమి.. రికార్డుల ప్రకారం 526 ఎకరాలు ఉండాలి. ఇందులోంచే 470 ఎకరాలను ఏపీఐఐసీకి ఇచ్చారు. ఇప్పుడు అందులో 22 ఎకరాలు కనిపించకుండా పోవడంతో ఇంకా ఎవరికీ కేటాయించని భూమి సంగతి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అది సక్రమంగానే ఉందా? ఆక్రమణలకు గురైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 22 ఎకరాల వ్యవహారం నలుగుతుండగానే ఇక్కడ మరో రెండెకరాలకు పైగా భూమిని ప్రైవేటు వ్యక్తుల పరమయ్యేలా రంగారెడ్డి జాయింట్ కలెక్టరు ఇటీవల ఉత్తర్వు ఇవ్వడం గమనార్హం.
దొడ్డ మలూర్లో ప్రేమ సాయిగా పుట్టపర్తి సత్య సాయి బాబా అవతారంSathya Sai Baba
కాగా, గ్రామంలో ఎవరు బాబా అవతారంగా చెప్పుకుంటారా అనే అయోమయం గ్రామంలో నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. సత్య సాయిబాబా అంచనా ప్రకారం ప్రేమ సాయి ఈ గ్రామంలో 2023లో పుడతాడని కృష్ణా చారిటబుల్ ట్రస్టు నడుపుతున్న రామదాసు అనే వ్యక్తి చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ కస్తూరి స్త్రీగా జన్మిస్తాడని, భద్రావతి నది సమీపంలోని ఆ గ్రామంలో జన్మించిన స్త్రీ గ్రామానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుని ప్రేమసాయికి జన్మ ఇస్తుందని సత్య సాయి చెప్పినట్లు ఆయన తెలిపారు.
Subscribe to:
Posts (Atom)