BREAKING NEWS
Friday, April 29, 2011
అనాధలను దత్తత తీసుకుంటున్న పవన్ సేవానిరతికి హ్యాట్సాఫ్...
అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సేవా గుణం మెండు అని చాలా విషయాలు ప్రూవ్ చేసాయి. తాజాగా మరో వార్త పవన్ సేవా గుణాన్ని బయట పెడుతోంది. ఇటీవల తన భార్య రేణుదేశాయ్ తన పిల్లలను తీసుకుని పవన్ ని వదిలేసి వెళ్ళిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంగా చాలా కాలంగా పవన్ కళ్యాణ్ చాలా టెన్షన్ లో ఉన్నాడని వినికిడి.
కానీ ఎన్ని టెన్షన్ లు ఉన్నా తనలో దాగి ఉన్న సేవాగుణంతో ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి భవిష్యత్తుకు గట్టి పునాది అవ్వాలని కోరుకుంటున్నాడట. కొంతమంది హీరోల్లా కేవలం మాటల వరకే పరిమితం కాకుండా పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఈ పని చేస్తాడని, అంతటి సేవాగుణం అతనికి ఉందని పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ మంచి పనిని ఖచ్చితంగా అందరూ అభినందించి తీరాల్సిందే...
చచ్చిపోతే ఏమౌతుంది? ('నేనూ..నా రాక్షసి' ప్రివ్యూ)
సంస్థ: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
నటీనటులు: రాణా, ఇలియానా, సుబ్బరాజు, అలీ, అభిమన్యు సింగ్, ముమైత్ఖాన్ తదితరులు
సంగీతం: విశ్వ-రెహమాన్
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
దర్శకత్వం: పూరి జగన్నాథ్
అక్రమ సంబంధంతోనే భార్య హత్య, ఇద్దరు పిల్లలనూ చంపిన కిరాతకుడు
భార్యను గొంతు కోసి హత్య చేసిన ప్రభాకర్ పిల్లలను హత్య చేసిన వారి శవాలను కాలువలో పడేశాడు. కాలువ నుంచి పిల్లల శవాలను పోలీసులు వెలికి తీశారు. యాకూబ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తాను తన భార్యను హత్య చేసినట్లు ప్రభాకర్ చెప్పాడు. రాత్రి కార్యాలయానికి వెళ్లినట్లు నటించి, వెనక్కి వచ్చి భార్యను, పిల్లలను ప్రభాకర్ హత్య చేశాడు. అరుణ ప్రభాకర్ను వదిలేసి గతంలో యాకూబ్తో వెళ్లిపోయింది. ప్రభాకర్ బతిలాడి తిరిగి ఆమెను తెచ్చుకున్నాడు. అయినా, యాకూబ్తో ఆమె తన సంబంధాన్ని వదులుకోలేదు. పైగా, తన ఇద్దరు కూతుళ్లలో ఓ కూతురు యాకూబ్ వల్లనే పుట్టినట్లు కూడా ప్రభాకర్ తెలుసుకున్నాడు. దీంతో భార్యను, పిల్లలను హత్య చేశానని ప్రభాకర్ అంగీకరించాడు.
గుంటూరులో భవాని మృతి: పోలీసులు అదుపులో ముగ్గురు విద్యార్థులు
కాగా జీడిమెట్లలోని సంజయ్గాంధీ నగర్లో ఉంటున్న భవాని జీడిమెట్లలోని శ్రీసాయి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 21వ తారీఖున పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని వెళ్లిన భవాని ఆ తర్వాత రోజు కూడా ఇంటికి రాకపోవడంతో భవాని తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 27న తారీఖున గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పరిసర గ్రామంలో కృష్ణా బ్యారేజ్లో శవంగా కనించింది.
బాలికపై రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్, దక్షిణ ఢిల్లీలో ఆరుగురి అకృత్యం
గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టయిన యువకులను రాజేష్ (21), అనిల్ (22), సిద్ధార్థ్ అలియాస్ సుధీర్ (20), ప్రతీక్ అలియాస్ సర్క్యూట్ (23), పింకు (22), తిలక్ అలియాస్ రాజా బాబు (23)గా గుర్తించారు. అండ్ర్యూస్ గంజ్లోని సీనియర్ అధికారులకు చెందిన సర్వెంట్స్ క్వార్టర్స్లో ఆ బాలిక తన కుటుంబ సభ్యులతో పాటు ఉంటోంది. తన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తండ్రి ఈ నెల 25వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనను వివేకానంద పార్కులో కలవాలని రాజేష్ ఆ బాలికకు చెప్పాడని, ఆమెను అక్కడి నుంచి సంగం విహార్లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడికి మిగతా వారు వచ్చారని, అక్కడే బాలికను వారు రేప్ చేశారని పోలీసు అధికారులు చెప్పారు. రేప్ చేసి ఆ బాలికను ఆమె ఇంటి వద్ద వదిలేశారని, అయితే భయంతో ఆమె ఇంటికి వెళ్లకుండా మిత్రురాలి ఇంటికి వెళ్లిందని చెప్పారు.
గుంటూరులో హైదరాబాద్ విద్యార్థినిపై అత్యాచారం, హత్య?
కాగా ఈ నెల 27న తారీఖున గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పరిసర గ్రామంలో కృష్ణా బ్యారేజ్లో శవంగా కనిపించింది. అయితే పోలీసులు మొదట గుర్తు తెలియని శవంగా చూసినప్పటికీ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు ఆ బాడీని భవానిదిగా గుర్తు పట్టారు. భవాని బాడీకి పోస్టు మార్టం చేశారు. కృష్ణా నదిలో భవాని ప్రమాదవశాత్తు మరణించిందా లేక ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారా తెలియలేదు. అయితే భవానిని తీసుకు వెళ్లిన స్నేహితులు (శ్రీకాంత్, పప్పుగా తెలుస్తోంది) పోలీసులకు అస్పష్టమైన సమాధానాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాలు జారి నదిలో పడిపోయిందని చెబుతున్నారు. అయితే కాలుజారి భవాని నదిలో పడిపోతే వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాల్సి ఉండగా ఎందుకు చెప్పలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జగన్, చిరుపై రాజశేఖర్, జీవిత ధ్వజం: కంటతడి పెట్టిన రాజశేఖర్
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఇప్పుడు కామెంట్ చేయడం అంటే చచ్చిన పామును కొట్టినట్లేనని అన్నారు. పిఆర్పీని స్థాపించి దానిని నడపలేక రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెసు పార్టీలో కలిపేశారని అన్నారు. పార్టీని నడపడం చేతకాకనే విలీనం చేశారని అన్నారు. మొదటి నుండి కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న చిరంజీవిని తీసుకోవడం విచారకరమన్నారు. పార్టీకి ఎంతో చేసిన తమను విస్మరించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, త్యాగాలు చేసిన తమను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, నాటి రాష్ట్ర ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలోనే కాంగ్రెసులో చేరిన విషయం గుర్తు చేశారు. వైయస్ దూరం కావడం దురదృష్టకరం అన్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా తాము అప్పుడు ఉన్నందునే మమ్మల్ని కాంగ్రెసులోకి ఆహ్వానించారని అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కూడా చిరంజీవికి పట్టున్న చోటనే తమ చోట ప్రచారం చేయించారని అన్నారు.
Subscribe to:
Posts (Atom)