ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామ జోగయ్య దీనిని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. జోగయ్యతో పాటు కరాటం రాంబాబు, తెలుగమ్మాయి నిర్మించిన వానపల్లి బాబురావు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కోడి రామకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు. కాగా బాబా అంతిమ సంస్కారాల సందర్భంగా సత్యసాయి మహిమలు, సేవా కార్యక్రమాలపై సినిమా ఎందుకు నిర్మించకూడదనే ఆలోచన వచ్చినట్టు హరిరామ జోగయ్య చెప్పారు. ఆ వెంటనే కోడి రామకృష్ణను సంప్రతిస్తే ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో 1994లో తాను మంత్రిగా ఉన్న సమయంలో బాబా వద్దకు తాను వెళ్లినప్పుడు వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు గెలవడం కష్టమని చెప్పారని అలాగే జరిగిందని చెప్పారు. ట్రస్టు సభ్యుల సహకారంతో కథను రెడీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
BREAKING NEWS
Thursday, April 28, 2011
దేవుళ్లు కాంబినేషన్లో వెండితెరపై సత్య సాయిబాబా మహిమలు చిత్రంSathya Sai Baba
ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామ జోగయ్య దీనిని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. జోగయ్యతో పాటు కరాటం రాంబాబు, తెలుగమ్మాయి నిర్మించిన వానపల్లి బాబురావు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కోడి రామకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు. కాగా బాబా అంతిమ సంస్కారాల సందర్భంగా సత్యసాయి మహిమలు, సేవా కార్యక్రమాలపై సినిమా ఎందుకు నిర్మించకూడదనే ఆలోచన వచ్చినట్టు హరిరామ జోగయ్య చెప్పారు. ఆ వెంటనే కోడి రామకృష్ణను సంప్రతిస్తే ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో 1994లో తాను మంత్రిగా ఉన్న సమయంలో బాబా వద్దకు తాను వెళ్లినప్పుడు వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు గెలవడం కష్టమని చెప్పారని అలాగే జరిగిందని చెప్పారు. ట్రస్టు సభ్యుల సహకారంతో కథను రెడీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment