దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. అభిమానుల అంచనాలను అందుకోవడమే కాక, అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ సినిమా అలరిస్తుంది’’ అని నిర్మాతలు చెప్పారు. దర్శకుడిగా తొలి చిత్రమే ప్రభాస్ లాంటి టాప్స్టార్తో చేయడం గర్వంగా ఉందని, కథను నమ్మి తనకు ఆయన ఈ అవకాశం ఇచ్చారని, ప్రభాస్ ఇమేజ్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే సినిమా ఇదని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభాస్ మాట్లాడుతూ -‘‘శివ కథ చెప్పిన తీరు వండర్. నా ఫ్రెండ్స్ అయిన వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఈ చిత్రానికి నిర్మాతలు అవ్వడం ఆనందంగా ఉంది. ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి, వేణుశ్రీరామ్, వక్కంతం వంశీ, మచ్చరవి, రవీందర్, శిరీష్, లక్ష్మణ్, జెమిని కిరణ్, బన్నీ వాసు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, లైన్ ప్రొడ్యూసర్: అశోక్కుమార్రాజు, నిర్మాణం: యూవీ క్రియేషన్స్.
Source:sakshi.com
No comments:
Post a Comment