కాంగ్రెసు అధిష్టానం కుట్రలో భాగంగానే తనపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అయినప్పటికీ దాన్ని వైయస్ జగన్ వర్గం ప్రశ్నిస్తోంది. ఈ స్థితిలో దట్స్ తెలుగు డాట్ కామ్ జగన్ వాదిస్తున్నట్లుగా సిబిఐ దర్యాప్తు కుట్రలో భాగమా అనే ప్రశ్న ఇచ్చి పోల్ నిర్వహించింది.
అయితే, పోల్కు కొన్ని పరిమితులున్న విషయాన్ని పాఠకులు గమనించాలి. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నావాళ్లు, దాన్ని వాడేవాళ్లు మాత్రమే ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వాడకం చాలా తక్కువ కాబట్టి గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యుల అభిప్రాయం ఇందులో ప్రతిఫలించే అవకాశం లేదు.
No comments:
Post a Comment