ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, February 6, 2011
జగన్ది జనాకర్షణే కాదు, పదవుల కోసమే చిరు దోస్తీ: రోజా
జగన్ది జనాకర్షణే కాదు, పదవుల కోసమే చిరు దోస్తీ: రోజా
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేవలం జనాకర్షణ మాత్రమే కాదని జనాధరణ కూడా ఉందని జగన్ వర్గం నేత, ప్రముఖ సినీ నటి రోజా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రజారాజ్యం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం దురదృష్టకరమన్నారు. అయితే ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కేవలం జగన్ ఒక్కరే ముందుకు తీసుకు వెళతారని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్ను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్నారు.
పదవుల కోసమే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేస్తున్నారన్నారు. పదవుల కోసం పార్టీని విలీనం చేస్తూ ప్రజల గురించి మాత్రం ఆలోచించడం లేదన్నారు. చిరంజీవి ప్రజల విశ్వాసం కోల్పోవడం వల్లే ప్రరాపాను కాంగ్రెస్లో విలీనం చేస్నున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్పై పోరాడాల్సిన చిరు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ప్రజలకు నమ్మక ద్రోహం చేయడమే అవుతుందన్నారు.
No comments:
Post a Comment